Gauri Kirloskar
గౌరీ కిర్లోస్కర్
నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
గౌరీ కిర్లోస్కర్ మే 2022 నుండి కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత, ఆమె న్యూయార్క్లోని మెరిల్ లించ్ లో వారి విలీనాలు మరియు స్వాధీనాల విభాగంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్గా పనిచేశారు. తదనంతరం, ఆమె పియర్సన్ కార్పొరేట్ ఫైనాన్స్ మరియు స్ట్రాటజీ గ్రూప్లో చేరారు, అక్కడ ఆమె వారి విద్యా బిజినెస్ కోసం అక్విజిషన్స్ (కొనుగోలు అంశాలను) చూశారు. పియర్సన్లో పనిచేసిన తర్వాత, గౌరీ కిర్లోస్కర్ తిరిగి భారతదేశానికి వచ్చి, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులలో కిర్లోస్కర్ గ్రూప్ కోసం వ్యూహాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించారు, అలాగే అనేక కిర్లోస్కర్ గ్రూప్ కంపెనీలలో డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.ఆమె 2014 నుండి కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్లో బోర్డు మెంబర్గా ఉన్నారు, ఆమె క్రమం తప్పకుండా సంస్థ యొక్క నిబంధనల అమలు మరియు పనితీరు సమీక్షలలో పాల్గొంటున్నారు. ఇంధన రంగంలో కొత్త పెట్టుబడి కార్యక్రమాలను పర్యవేక్షించే కమిటీలో ఆమె క్రియాశీల సభ్యురాలు.
శ్రీమతి గౌరీ కిర్లోస్కర్ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ అనుబంధ సంస్థలైన లా-గజ్జర్ మెషినరీస్ (పంప్ల తయారీ సంస్థ) మరియు అర్కా ఫిన్క్యాప్ బోర్డులలో సభ్యురాలు. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్కు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యే ముందు, పూణేలో గ్రూప్ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ ని స్థాపించడంలో ఆమె ప్రాథమిక పాత్ర పోషించారు. గ్రూప్ యొక్క ల్యాండ్ బ్యాంకుల అమ్మకం మరియు డెవలప్మెంట్ కి సంబంధించి విలువ సృష్టి అవకాశాల విశ్లేషణ ఇందులో ఉంది. టైటిల్ క్లియరెన్స్, భూమి అనుమతులు, డిజైన్ బ్రీఫ్ రూపకల్పన, ఐపిసి లతో సన్నిహితంగా పనిచేయడం మరియు సంభావ్య కస్టమర్లతో నిమగ్నమవ్వడం వంటి పనులలో ఆమె పాలుపంచుకున్నారు.
ఆమె గ్రూప్ స్థాయిలో హెచ్ఆర్ , బ్రాండింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మరియు షేర్డ్ సర్వీసెస్ వంటి విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు. "కిర్లోస్కర్ లిమిట్లెస్" బ్యానర్ కింద గ్రూప్ యొక్క ఇటీవలి బ్రాండ్ రిఫ్రెష్ కార్యక్రమానికి ఆమె నాయకత్వం వహించారు మరియు మొత్తం ప్రాజెక్ట్కు బాధ్యత వహించారు. ఆమె ప్రస్తుతం గ్రూప్ కోసం కొత్త బ్రాండ్ మరియు కమ్యూనికేషన్స్ టీమ్ను నిర్మిస్తున్నారు. ఆమె "కిర్లోస్కర్ వసుంధర" కింద పర్యావరణ రంగంలో గ్రూప్ యొక్క సిఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆమె ఏకాగ్రిడ్ విశ్వవిద్యాలయం యొక్క కోర్ అడ్వైజరీ టీమ్లో ఉన్నారు, ఇది 2050 నాటికి ప్రపంచంలోని టాప్ 25 ర్యాంకింగ్స్లో నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఒక మల్టీడిసిప్లినరీ పరిశోధన విశ్వవిద్యాలయం.
శ్రీమతి గౌరీ కిర్లోస్కర్ 2006లో కార్నెగీ మెల్లన్ యొక్క టెప్పర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఫైనాన్స్ స్పెషలైజేషన్తో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బిఎస్ సి పట్టా పొందారు మరియు బోస్టన్ సమీపంలోని ఆండోవర్లోని ఫిలిప్స్ అకాడమీలో చదువుకున్నారు.
వెనక్కి వెళ్ళండి